మద్యం మత్తులో పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన సంఘటన పై రాయవరం పోలీసులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చిన డెత్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పి వెంకటేశ్వరరావు శుక్రవారం సాయంత్రం స్థానిక విలేకరులకు తెలిపారు.
ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని సోమేశ్వరం గ్రామానికి చెందిన కుంచాల దుర్గారావు (45) ఇటుకుల ట్రాక్టర్ పై పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దుర్గారావుకు భార్య కుంచాల కుమారి వీరికి ఇద్దరు ఆడపిల్లలు తో జీవిస్తున్నారు.
ఇదిలా ఉంటే దుర్గారావు అధిక మద్యం సేవించి భార్యతో గొడవపడి మనస్థాపన చెంది చనిపోవాలని నిర్ధారించుకుని పురుగుమందు త్రాగక కుటుంబ సభ్యులు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడనుండి మెరుగైన చికిత్స కొరకు కాకినాడ జి జి హెచ్ కు తరలించి చికిత్స పొందుతుండగా ఈనెల 19వ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు దుర్గారావు మరణించినట్లు రాయవరం పోలీసులకు కాకినాడ జిజిహెచ్ నుండి వచ్చిన డెత్ ఇంటిమేషన్ పై కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్ ఐ పి వెంకటేశ్వరరావు తెలిపారు.