తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా కలసప్పక్కం పక్కనే ఓరంతవాడి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పళనిస్వామి వల్లీ అనే దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి సంతానం. కొన్ని రోజుల నుంచి పళనిస్వామి – వల్లీ మధ్య వివాదం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో భర్త పళనిస్వామి భార్య, నలుగురు పిల్లలను గొడ్డలితో హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.