ఇటీవలే ప్రముఖ వీణా విద్వాంసులు వాసా వంకట వర ప్రసాద్ కాలం చేసిన సంగతి తలిసిందే. వారి జ్ఙాపకార్ధం..ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ , “నా ఊరు విజయనగరం” సమక్షంలో వాసా వెంకట వర ప్రసాద్ కు నివాళి కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది. ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం…విజయనగరంలోని కొత్తపేటలోని ఎఫ్.ఎఫ్.ఏ కార్యాలయంలో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు సంగీత కార్యక్రమం ఉంటుందని ఎఫ్.ఎఫ్.ఏ కార్యదర్శి డా. మండపాక రవి తెలిపారు.ఆ కార్యక్రమంలో ముంబైకి చెందిన ఎన్ డి విజయ్ కుమార్ గాత్రకచేరి ఉంటుందని.. పక్క వాయిద్యాలుగా… వయోలిన్ మహాదాస్ శ్యామనీలాద్రి, మృదంగంపై డాక్టర్ మండపాక రవి, ఘటంపై తెనాలికి చెందిన కె.వి రామకృష్ణ సహకారం అందిస్తారని డా. రవి తెలిపారు.
previous post