38.2 C
Hyderabad
April 27, 2024 15: 33 PM
Slider ప్రత్యేకం

రామోజీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు. గంటకుపైగా రామోజీతో వివిధ అంశాలను చర్చించారు.  కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ సమకాలీన రాజకీయ పరిస్థితులను చర్చలు జరిపారు. లౌకికవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని, భవిష్యత్తులో అనుసరించాల్సిన  వ్యూహాలు, పార్టీలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై  తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ భేటీలో సీఎం వెంట  ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్​ రెడ్డి  రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు.

Related posts

వ‌ర‌ద స‌హాయంపై బుర‌ద రాజ‌కీయాలు

Sub Editor

ప్రపంచ రికార్డు కోసం మహిషాసుర మర్ధని స్తోత్ర గానం

Satyam NEWS

నిరాడంబరంగా మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment