అమితాబ్ బచ్చన్ కుటుంబానికి శుభవార్త. అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇంత కాలం కరోనాతో ఇబ్బంది పడ్డారు. తాజాగా ఆయనకు జరిపిన పరీక్షల్లో కరోనా నెగెటీవ్ వచ్చింది.
అమితాబ్ బచ్చన్ కు ముందుగా కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో దేశవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో అలజడి రేగింది. తర్వాత ఆయన కుమారుడు అభిషేక్ కు ఆయన భార్య ఐశ్వర్యారాయ్ కి, ఆయన కుమార్తె ఆరాధ్య కు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది.
అయితే ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ కి ఆరాధ్యకు నెగెటీవ్ వచ్చింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కు కరోనా తగ్గిపోయింది. ఇప్పటి వరకూ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా తగ్గింది.