38.2 C
Hyderabad
April 28, 2024 20: 57 PM
Slider ఆదిలాబాద్

అన్నకు ఏసీబీ వల… తమ్ముడు నకిలీతో విలవిల

#AdilabadPolice

ఏసీబీకి పట్టుబడ్డ ఆదిలాబాద్ పంచాయతీరాజ్ ఏఈ చంద్రశేఖర్ కేసులో శుక్రవారం మరో కొత్త కోణం వెలుగు చూసింది.

 పంచాయతీరాజ్ లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న  నవీన్ జాదవ్, స్టూడెంట్ రమేష్  కలిసి జై చంద్ర శేఖర్  సోదరుడు టీచర్ గా పనిచేస్తున్న తాడిచర్ల రఘునాథ్ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు జరగవచ్చు అని మాయమాటలతో నమ్మ పలికి  ఆస్తి దస్త్రాలు, ఎల్ఐసి బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లి పోయారు. దీనిపై బాధితుడు పట్టణంలోని వన్ టౌన్ లో  పట్టణ  ఫిర్యాదు చేశాడు.

దీనిపైకేసు నమోదు చేసి పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ,ఎస్సైలు, జి అప్పారావు, జాదవ్ గుణవంత రావు, ఒక్కరోజులోనే దర్యాప్తు చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులు పై కేసు నమోదు చేసి, వెంటనే ఐదుగురిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.

సీఐ ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం పంచాయతీరాజ్ ఏఈ ఈ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో అదే శాఖలో పని చేస్తున్న నవీన్ జాదవ్, విద్యార్థి రమేష్ తో కలిసి కుట్రపన్నారు.

మాయమాటలతో దస్త్రాలు దోపిడి

కుట్రలో భాగంగా ఇరువురు కలిసి స్థానిక పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలోని చంద్ర శేఖర్ సోదరుని ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి ఆస్తికి సంబంధించిన దస్త్రాలు ఎత్తుకెళ్లారు, అనంతరం ఫోన్ ద్వారా రఘునాథ్ ను బెదిరించి దస్త్రాలు కావాలంటే దస్త్రాల విలువలో 20 శాతం తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానిక సివిల్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ ద్వారా ఫోన్ చేసి బెదిరించారు. ఆయన స్పందించకపోవడంతో  స్థానిక భూక్తా పూర్ కాలనీలోని ఐటీ కన్సల్టెంట్ నరోత్తం రెడ్డి ని సంప్రదించి ఆయన ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ విధంగా నలుగురిని కుట్రలో భాగస్వామ్యం చేసి రఘునాథ్ ను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. తరచుగా ఫోన్ లు లు రావడంతో బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఈ సందర్భంగా కేసు నమోదు చేసి ఫోన్ నంబర్ల ఆధారంగా ఆరుగురు నిందితులు కుట్రలో భాగస్వాములు అయినట్లు గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి ఆదిలాబాద్ కు చెందిన నవీన్ జాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీరాజ్ శాఖ, బొడ్డెండ్ల రమేష్, (25) విద్యార్థి, బోడ్డెండ్ల శ్రీనివాస్, సివిల్ కాంట్రాక్టర్, నరోత్తం రెడ్డి, ఐటీ కన్సల్టెంట్, జనగాం సంతోష్, లను అరెస్టు చేసి కోర్టులో  ప్రవేశపెట్టినట్టు సిఐ వెల్లడించారు.

ఆరవ ముద్దాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి బాలు జైస్వాల్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఏసీబీ అధికారులకు చిక్కిన చంద్రశేఖర్ కేసులో కుటుంబ సభ్యులను బెదిరించి లబ్ధి పొందాలని కుట్ర పన్నినట్లు సిఐ వెల్లడించారు. ఆరుగురు ముద్దాయిలుపై నాన్ బెయిలబుల్ కేసులు 384,385,420,506 IPC కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

24 గంటల్లోనే కుట్ర ను భగ్నం చేసి, నిందితులను అరెస్టు చేసి దస్త్రాలను స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులను డిఎస్పి వెంకటేశ్వరరావు స్వయంగా పోలీస్ స్టేషన్ వచ్చి దర్యాప్తు, కేసును ఛేదించిన వివరాలు తెలుసుకొని అభినందించారు.

Related posts

పాకిస్తాన్ లో తీవ్రమైన ఆహార సంక్షోభం

Satyam NEWS

రాజశేఖర్ రెడ్డిపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ

Satyam NEWS

కంకులు కొన్న కవిత

Bhavani

Leave a Comment