బర్త్ సర్టిఫికెట్ కావాలిరా బాబూ అని అడిగితే మరి నాకేంటి? అన్నాడో ప్రబుద్ధుడు. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం నీ విధి కదా అని అడిగితే అలాంటిదేం లేదు లంచం ఇవ్వాల్సిందేనన్నాడు. తూర్పుగోదావరిజిల్లా తుని ప్రాంతంలోని
తాళ్లూరు గ్రామానికి చెందిన సత్య ప్రసాద్ తన చిన్నారుల బర్త్ సర్టిఫికెట్ల కోరకు పలుమార్లు విఆర్వో చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందాడు. బర్త్ సర్టిఫికెట్ల ఇవ్వాలంటే రూ. నాలుగువేలు ఇవ్వాలని తాళ్లూరు వీఆర్వో అర్జుబాబు డిమాండ్ చేశాడు.
ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సరిగ్గా బాధితుడు విఆర్వో అర్జు బాబుకు లంచం అందిస్తుండగా ఏసీబీ డి.ఎస్.పి రామచంద్ర రావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.