39.2 C
Hyderabad
April 28, 2024 13: 38 PM
Slider రంగారెడ్డి

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

#MalkajgiriACP

అక్షరాలా  50 కోట్ల రూపాయల అక్రమాస్తులు మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికాయి. వామ్మో ఇంతా అని ఆశ్చర్యపోవద్దు. ఇంకా అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

ఫైనల్ గా ఎంత బయటపడుతుందో అర్ధం కావడం లేదు. మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా చిక్కడపల్లి ఏసీపీ గా న‌ర్సింహారెడ్డి ప‌ని చేశారు. అనేక భూత‌గాదాల్లో త‌ల‌దూర్చినట్లు ఆయనపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు గుర్తించిన ఏసీబీ దాడులు చేసింది. మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి.

 హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్‌లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి.

Related posts

ఏప్రిల్ 2న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

Satyam NEWS

ములుగులో చురుకుగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు

Satyam NEWS

పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరం

Satyam NEWS

Leave a Comment