మత్స్య కారుల సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభ నిర్వహించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వెళుతుండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. సభకు హాజరయ్యేందుకు ర్యాలీగా వెళుతుండగా ఒక అభిమాని ఆయన కారుపైకి ఎక్కారు. అభిమాని పవన్ కల్యాణ్ ను కౌగలించుకోవడానికి ప్రయత్నించగా ఆయన బాడీ గార్డులు అడ్డుకున్నారు. ఈ గందరగోళంలో పవన్ కల్యాణ్ కింద పడిపోయారు. అయితే ప్రమాదం ఏమీ జరగకపోవడంతో అభిమానులు ఊపిరిపల్చుకున్నారు.