నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలంలో గల ఆర్గుల్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జక్రాన్పల్లి గ్రామానికి చెందిన పైడి సత్తెమ్మ, సుందరమ్మ అనే ఇద్దరు మహిళలు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు
previous post