బాగ్ అంబర్ పేట డివిజన్ లోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో అయ్యప్ప స్వామి వారి దేవస్థానం వెనకాల ఉన్న పాత కమినిటీ హాల్ నీ పురారుద్ధరించడానికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సంకల్పించారు. ఆ పాత భవంతిని కూలగొట్టి ఒక రెండు అంతస్తుల నూతన భవనం 60 లక్షల రూపాయలు ఖర్చు చేసి అక్కడి కాలనీ వాసుల సౌకర్యం కోసం నిర్మించారు.
ఈ నేపథ్యంలో కాలేరు వెంకటేష్ బుధవారం హాల్ పనులు వీక్షించడానికి అక్కడికి చేరుకున్నారు. కాలనీ వాసులతో ముచ్చటించారు. వారికి ఆ కమ్యూనిటీ హాల్ అతి త్వరలో అందుబాటులో ఉండగలదు అని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కార్యదీక్ష కి నాయకత్వానికి అక్కడి ప్రజలు ఎంతో ఆనందించారు.
సత్యం న్యూస్, అంబర్పేట్