ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవ ధర్మం అని, ప్రతి ఒక్కరు సేవ గుణాన్ని అలవర్చుకోవాలి ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ అన్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే కూలీలకు నిత్యవస సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ దాతృత్వం తో నాంపల్లి ,కాచిగూడ స్టేషన్లో పనిచేసే 110 మంది లైసెన్స్ పోర్టర్లు కు హైదరాబాద్ స్టేషన్ డైరెక్టర్ ఖురిషి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గరికపాటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కూలీలు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.టి.ఐ పి.ఆర్.కె రాజు, ఎస్.ఎం.ఆర్ శివ ప్రసాద్, సి.హెచ్.ఐ అశోక్ కుమార్,ఐ. ఓ.డబ్ల్యు సాయి ప్రసాద్,సి.పి.ఎస్.ఆర్ రవీంద్ర,సి.ఆర్.ఐ శ్రీనివాసు,ఆర్. పి.ఎఫ్ సి.ఐ చౌదరి, యూనియన్ సంగ్, ఎస్.సి, ఎస్టీ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.