30.7 C
Hyderabad
April 29, 2024 03: 51 AM
Slider నిజామాబాద్

గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు

bichkunda 20

కామారెడ్డి జిల్లా మద్దూనురు మండలంలోని పెద్ద ఎక్లారా గేట్ వద్ద గల  బాలికల గురుకుల పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ  భవనాలకు జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులతో పాటు ఎమ్మెల్యే కూడా చిందేసి  విద్యార్థులకు ఉత్సాహం నింపారు.

అనంతరం పాఠశాల తరపున ఎమ్మెల్యేకు సన్మానం చేయగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతంలో ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థిని చదవడానికి గురుకుల పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్, బండు పటేల్, శ్రీను పటేల్, ప్రిన్సిపాల్ జనార్ధన్, ఉపాధ్యాయ బృందం విద్యార్థినులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీలో పెద్ద ఎత్తున చేరిన గ్రామీణ యువకులు

Satyam NEWS

ఓపీనియన్: నిషేధించాల్సిన యాప్ లు ఇంకా ఉన్నాయి

Satyam NEWS

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇస్తాం

Satyam NEWS

Leave a Comment