ఇటీవలే రాష్ట్రస్థాయిలో కమ్యూనికేషన్ ఏఎస్సైలకు పదోన్నతులు కల్పించడంతో పాటు ఖాళీలనుసారంగా స్థానచలనం చేసిన క్రమంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్సైగా పనిచేసిన 2018 బ్యాచ్ కు చెందిన పి. గణేష్ ఆదిలాబాద్ జిల్లాకు బదిలీపై వచ్చి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.
జిల్లాలో పనిచేసిన వి. గంగాసాగర్ ఎస్సై పదోన్నతిపై నిజామాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు.ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కమ్యూనికేషన్ ఎస్ఐ పి. గణేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తుందని, శాంతి భద్రతల పరిరక్షణలో కమ్యూనికేషన్ హ్యాండ్ సెట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ వాహనాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా పరస్పర సమాచారం తెలుసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ వి.గంగా సాగర్, క్యాంపు కార్యనిర్వహణధికారి దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సిఐ జి మల్లేష్, ఎస్సై సయ్యద్ అన్వర్ ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు.