ఖమ్మం జిల్లా మధిర కు చెందిన సీనియర్ న్యాయవాది అవ్వా విజయలక్ష్మికి పి.వి.శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 పీవీ అభిమాన సంఘాల వారు వివిధ రంగాల్లో వారి వారి ప్రతిభను బట్టి మన తెలుగు తేజం జ్యురి జాతీయ అవార్డులకు ఎంపిక చేసారు.
ఇందులో భాగంగా అనేక సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపట్టిన మధిర గ్రామానికి చెందిన అవ్వా విజయలక్ష్మి ని ఎంపిక చేసినట్లు అవార్డుల కమిటీ కన్వినర్ పివి రమణ గుప్తా నుండి ప్రత్యేక ఆహ్వాన లేఖ పంపినట్లు ఆమె తెలిపారు.
ఈ అవార్డు రావటం పట్ల అవ్వా విజయలక్ష్మి ని మధిర బార్ అసోసియేషన్, మధిర ప్రాంతం ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పలువురు అభినందించారు.