26.7 C
Hyderabad
May 3, 2024 10: 32 AM
Slider ముఖ్యంశాలు

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా పరీడా

#AKParedaIAS

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ కె పరీడా ను నియమించారు. ఏ కె పరీడా 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.

తనకు కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రానికి లాభదాయకంగా ఉండే నిర్ణయాలు తీసుకుంటూ కాలుష్య నియంత్రణ మండలిని సమర్ధంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాలుష్య నియంత్రణ మండలి పనితీరును మరింతగా మెరుగు పరుస్తానని ఆయన తెలిపారు.

ఏ కె పరీడా 2017లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. గతంలో పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలో పని చేసిన అనుభవం ఆయనకు ఉన్నది.

Related posts

జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఉపముఖ్యమంత్రి మామగారు

Satyam NEWS

సంక్షోభంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ

Murali Krishna

హైదరాబాద్ అపోలోకు మంత్రి వెల్లంపల్లి తరలింపు

Satyam NEWS

Leave a Comment