33.7 C
Hyderabad
April 28, 2024 00: 13 AM
Slider నల్గొండ

మునుగోడు కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

#munugodu

మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధం చేశారు అధికారులు. నవంబర్ 6, ఆదివారం నాడు ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నల్గొండ పట్టణంలోని అర్జాల భావి లోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 15 రౌండ్స్ లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్స్ లాల్లో లెక్కిస్తారు. మొదట పోలింగ్ ఏజెంట్ లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడు లో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవిఎం,లాల్లో పోలైన ఓట్లను లెక్కిస్తారు.

ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్ ,అసిస్టెంట్ సూపర్వైజర్ ,మైక్రో అబ్జర్ వర్ లను నియమిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల అవుతుంది. చివరి రౌండ్ ఫలితం వంటి గంటకు విడుదల అవుతాయి. ఇలా 15 రౌండ్స్ లాల్లో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు.

మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత నారాయణ పురం, మునుగోడు, చండూర్ , మర్రిగూడం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బంది కి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.మజిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్, ఓ, రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణ లో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతున్నది. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద , సి ఆర్ పి ఎఫ్, బలగాలతో, సి, సి,కెమెరా ల పర్యవేక్షణ లో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదు అయింది. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్ లను నియమించుకునేల అధికారులు అనుమతి ఇచ్చారు.

Related posts

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

Satyam NEWS

పార్టీ మారే విషయం మీడియా సృష్టి

Satyam NEWS

బత్తాయి ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

Satyam NEWS

Leave a Comment