కొత్త పాత అనే బేధం లేకుండా నాయకులంతా కలిసి పనిచేయాలని, మనందరి అంతిమ లక్ష్యం కాంగ్రెస్ విజయమేనని ఆ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం లోని ఎస్ఆర్ కన్వెన్షన్ లో ఖమ్మం రూరల్ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అధికార దాహంతో పాలకులు అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాలో అధికార నేతలు ఇష్టం వచ్చినట్లుగా ఇతర పార్టీల నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులు, కార్యకర్తలకు పొంగులేటి అండగా నిలుస్తారని అభయమించారు.
ప్రజా సంక్షేమ పాలన కోసమే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందని తెలిపారు. గడపగడపకు కాంగ్రెస్ పేరిట ఊరురా తిరుగుతూ 6 గ్యారంటీలను వివరిద్దామన్నారు. పాలేరులో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా మనమందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి , రూరల్ మండల అధ్యక్షులు కల్లెం వెంకట్ రెడ్డి, బైరు హరినాధ్ బాబు, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, కన్నేటి వెంకటేశ్వర్లు, నాగండ్ల శ్రీనివాసరావు, సర్పంచులు గోనె భుజంగ రెడ్డి, ముత్యం చిన్న కృష్ణారావు, కేతినేని వేణు, చావా శివరామ కృష్ణ, పేర్ల పాండు, మాళోతు భోజ్యా, మాజీ సర్పంచులు బోడా వెంకన్న, మద్ది వీరారెడ్డి, తోట వీరభద్రం, ఏటుకూరి సుధాకర్, ఐతగాని అంజయ్య, ఆరెంపుల రామయ్య, బానోతు హరి, యర్రంశెట్టి వెంకటరమణ తదితరులున్నారు.