33.7 C
Hyderabad
April 28, 2024 23: 45 PM
Slider శ్రీకాకుళం

ఏప్రిల్ 2 న అమరావతి జేఏసీ సమావేశం

#picini

ఈ నెల 2న విజయవాడలో రెవెన్యూ భవన్ లో జరగనున్న  అమరావతి జేఏసీ సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు పిసిని వసంతరావు, కూన రంగనాయకులు ఓ ప్రకటనలో కోరారు. ఈ సమావేశంలో డీఈవో పూల్ లో మిగిలిన తెలుగు, హిందీ, ఒడియా  భాషా పండితులు అయిన  202 మంది  సమస్య పరిష్కారానికి కీలక తీర్మానాలు చేయనున్నారని తెలిపారు. చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అంకాల్  కొండయ్య, గాండ్లపర్తి శివానందరెడ్డి లు పాల్గోనున్న కార్యక్రమానికి అమరావతి జేఏసీ  పక్షాన ప్రభుత్వానికి అందజేసిన 50 పరిష్కార అంశాలలో డీఈవో పూల్ పండితుల సమస్య ప్రధానంగా పేర్కొన్నారని అన్నారు. జిల్లాలో డీఈవో పూల్ భాషా పండితుల సహా భాషోపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.

Related posts

ఆ మూడుగంట‌లు ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద ట్రాపిక్ క్లియ‌ర్…..!

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి

Satyam NEWS

వార్నింగ్:రజనీకాంత్ నుచంపుతామని బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment