ప్రతి ఒకరు బూస్టర్ డోస్ తీసుకోవాలని కాచిగూడ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్ అన్నారు. గురువారం సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి చెప్పల్ బజార్ లోని క్వాలిటీ అపార్ట్మెంట్ లో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీనివల్ల ప్రాణాపాయం నుండి రక్షిస్తుందని, 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరములు నిండిన పిల్లలు కూడ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందిర, సబిత, విజయ్ కుమార్, నర్సింగ్, చంద్రమౌళి, బి. సంతోష్, క్షీర సాగర్, సుభాష్ పటేల్, హజారి బాబు, బల్ వీర్, మల్లికార్జున్, వాసు, బి.భీమ్ రాజ్, పంకజ్, ఆర్.సంతోష్, నాగు, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట
previous post
next post