29.7 C
Hyderabad
April 29, 2024 09: 55 AM
Slider హైదరాబాద్

ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియచేయండి

అంబర్ పేట్ డివిజన్ ఆజాద్ నగర్ లో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు నల్ల నీరు లోప్రెషర్ వస్తుందని తెలియజేయడంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, అధికారులతో కలిసి సమస్యని పరిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని నల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఇంటింటికి తిరుగుతూ మంచినీటి సరఫరా నీ పరిశీలించి, వేసవి కాలం అయినప్పటికీ నీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామి ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని స్థానికులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జాఫర్, సీనియర్ నాయకులు లింగారావు, అరుణ్ కుమార్ రెడ్డి, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

క్రీడలు ప్రోత్సహించే విధంగా సారధి చిత్రం

Bhavani

కరోనా ప్రకోపంతో పంజాబ్ రాష్ట్రంలో మళ్లీ ఆంక్షలు

Satyam NEWS

ఉత్తరాంధ్ర కల్పవల్లి పండుగ బందోబస్తు పై డీఐజీ ప్రత్యేక దృష్టి

Satyam NEWS

Leave a Comment