అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంతో పాటు చిరుమర్రి , పమ్మి గ్రామాల్లో రైతు వేదికలను వల్లభి గ్రామంలో ప్రకృతి వనం ను జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ , డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, తమ్ముడు ఖమ్మం ఆర్ డి ఓ రవీంద్రనాధ్, ఎంపీపీ సామినేని హరిప్రసాద్ , జడ్పీటీసీ పసుపులేటి , వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు నాయకులు పాల్గొన్నారు.