27.7 C
Hyderabad
April 26, 2024 06: 04 AM
Slider కడప

వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ పిటిషన్‌పై నేడు విచారణ

#YSVivekanandaReddy

కడప జిల్లా పులివెందుల  మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందులలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి గురువారం పరిశీలించారు.

దానిని నేర విభాగానికి పంపించారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరపనున్నట్లు న్యాయవాదులు తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరయ్యారు.

ఈ క్రమంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శ్రీకాంత్‌ను ఒక ప్రత్యేక గదిలో వారు కలిసి సుమారు అరగంటపాటు చర్చించారు. అనంతరం సీబీఐ అధికారులు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కలిసి ప్రత్యేక వాహనంలో బయలుదేరి వెళ్లారు.

ఈ నెల 13వ తేదీన ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందులకు రాగా.. ప్రస్తుతం మరో ఇద్దరు వచ్చారు.

Related posts

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సినీ నటుడికి జరిమానా

Satyam NEWS

కోరుకొండ, నవోదయ ప్రవేశ పరీక్షలకు త్రిశూల్ శిక్షణ

Satyam NEWS

నెల్లూరులో హైవే ప్రయాణాల పై అవగాహన ర్యాలీ

Satyam NEWS

Leave a Comment