హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డివిజన్ లో పెండింగ్ ఉన్న పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎ.జీవన్ గౌడ్ కోరారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్ పదవి కాలం ఇంకా నాలుగు నెలల్లో ముగుస్తుందని ఈ నాలుగు నెలల వ్యవధిలో మొత్తం పెండింగ్ పనులను పూర్తి చేయాలని అన్నారు.
కార్పొరేటర్ ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కేవలం సంపన్నుల కాలనీలకు మాత్రమేనని పేద ప్రజల బస్తీలలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అన్నారు. గౌడ సంఘం వెనుక బుర్జుగల్లిలో రోడ్డు వేస్తామని గత నాలుగు సంవత్సరాల నుంచి చెబుతూ వస్తున్నా ఇప్పటి వరకు రోడ్డు వేయించ లేదని ఆయన అన్నారు.
స్థానిక కార్పొరేటర్ కాలనీ కార్పొరేటర్ అని ముద్ర పడిపోయిందన్నారు. ఈ ఆఖరు నాలుగు నెలల్లో అయినా పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన కోరారు.