సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నూతన అంబులెన్స్ బహుకరించారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ కేటిఆర్ జన్మదిన సందర్భంగా Gift A Smile లో భాగంగా ఈ అంబులెన్స్ ను 22 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, కరోనా సమయంలో సేవలు అందించిన పిదప హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు అందించేందుకు తీసుకువచ్చామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, ఎంపిపి గుడెపు శ్రీను, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమరనాద్ రెడ్డి, ఇతర మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.