పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన ఒక రోగి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45) కరోనా సోకడంతో ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతను భవనం పైనుంచి దూకాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కరోనా పేషెంట్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.