25.7 C
Hyderabad
May 24, 2025 08: 39 AM
Slider ప్రపంచం

అమెరికా ఆంక్షలకు చైనా ప్రతీకార చర్యలు

#America and China

కమ్యూనిస్టు పార్టీ చీఫ్ జిన్జియాంగ్ మరి కొందరు చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించినందుకు బదులుగా చైనా నేడు ముగ్గురు అమెరికన్ జాతీయులపై ప్రతీకార ఆంక్షలు విధించింది. పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన చైనా విమర్శకులు సెనేటర్లు మార్కూ రుబియో, టెడ్ క్రుజ్, కాంగ్రెస్ నాయకుడు క్రిస్ స్మిత్ అంతర్జాతీయ మత స్వేచ్ఛ అమెరికా ప్రతినిధి సామ్ బ్రౌన్ బాగ్ లపై చైనా ఆంక్షలు విధించింది.

వారి కదలికలపై నిషేధాన్ని విధించినట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా ఛున్యింగ్ తెలిపారు. అమెరికా తక్షణమే తన తప్పుడు విధానాలు మార్చుకోవాలని, తప్పుగా విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. చైనా అంతర్గత విషయాలలో గానీ చైనా కు సంబంధించి అపకారం చేసే వ్యవహారాలను గానీ నిలుపుదల చేయకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Related posts

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

Sub Editor

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌: నలుగురు మావోయిస్టుల మృతి

Satyam NEWS

నిజాంపేట్ కార్పొరేషన్ లో రోజుకో కబ్జా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!