అమర్ నాథ్ యాత్రీకులకు శుభవార్త. ఈ ఏడాది అమర్ నాథ్ వెళ్లే వారి కోసం తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 446 పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లలో నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది.
మొత్తం 37 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ బ్యాంకుల బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది కేవలం అక్కడి సాదువులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి కరోనా తగ్గు ముఖం పట్టినందున అమర్ నాథ్ యాత్రకు అనుమతినిస్తున్నారు.
జూన్ 28 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది.
హిమాలయాలపై 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్ నాథ్ దేవాలయాన్ని చేరుకోవడానికి 2019 లో 3.42 లక్షల మంది వచ్చారు.