30.7 C
Hyderabad
April 29, 2024 06: 07 AM
Slider ప్రత్యేకం

అమర్ నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 1 నుంచి

Amarnath

అమర్ నాథ్ యాత్రీకులకు శుభవార్త. ఈ ఏడాది అమర్ నాథ్ వెళ్లే వారి కోసం తేదీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 446 పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ లలో నమోదు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది.

మొత్తం 37 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ బ్యాంకుల బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది కేవలం అక్కడి సాదువులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి కరోనా తగ్గు ముఖం పట్టినందున అమర్ నాథ్ యాత్రకు అనుమతినిస్తున్నారు.

జూన్ 28 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం అవుతుంది.

హిమాలయాలపై 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్ నాథ్ దేవాలయాన్ని చేరుకోవడానికి 2019 లో 3.42 లక్షల మంది వచ్చారు.  

Related posts

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Satyam NEWS

వచ్చే నెల 25 నాటికి కోటప్పకొండ తిరుణాళ్ల ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

తెలంగాణ తో సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ షురూ

Bhavani

Leave a Comment