40.2 C
Hyderabad
April 29, 2024 18: 26 PM
Slider కడప

అన్నమాచార్య గ్రూప్ కరోనా విరాళం రూ.5 లక్షలు

Annamayya College

కరోన వైరస్ బాధితుల సహాయార్ధం రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల, ఫార్మరీ కళాశాల, బి.యి.డి కళాశాల, అన్నమాచార్య పి.జి కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ కళాశాల సిబ్బంది రూ.5 లక్షల విరాళం ఇచ్చారు. అన్నమాచార్య కాలేజి వ్యవస్థాపకులు  చోప్ప గంగిరెడ్డి  సలహా మేరకు సంస్థ వైస్ చైర్మన్  యల్లారెడ్డి  ఈ విరాళాన్ని రాజంపేట ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి కి అందజేశారు.

నిరాశ్రయులకు భోజన సదుపాయాలు కల్పించాలని, కరోనా నియంత్రణ వస్తువులు కొనుగోలు చేయాలని దాతలు ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీవో  మాట్లాడుతూ విరాళం ఇచ్చినందుకు అన్నమాచార్య విద్యా సంస్థల యాజమాన్యం కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మొత్తం విరాళాన్ని ఆర్ టి జి ఎస్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపారు. ఈ కార్యక్రమం లో కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ యస్.యం.వి. నారాయణ, డాక్టర్ బి. జయరాం రెడ్డి, డాక్టర్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

పి.ఎఫ్ డబ్బులను దోచుకున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

Bhavani

ప్రకాశ్ రాజ్ ఓటమికి రాజకీయ పార్టీల భారీ స్కెచ్

Satyam NEWS

మేరీ మాత విగ్రహం ధ్వంసం

Satyam NEWS

Leave a Comment