లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యం ప్రజలకు ఆహార పంపిణీ చేస్తున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ నేడు నూతనంగా అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించారు. వెంగళ్ రావు నగర్ డివిజన్ లోని యాదగిరి నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు అన్నపూర్ణా క్యాంటిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.
దీని ద్వారా 300 మంది నిరుపేదలకు, వలస కూలీల కు ఉదయం, సాయంత్రం అన్నం అందిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య వేణుగోపాల్ యాదవ్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.