40.2 C
Hyderabad
April 29, 2024 17: 37 PM
Slider నిజామాబాద్

మరో క్రైమ్:బోధన్ పట్టణంలో యువతిపై అత్యాచారం

rape again

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది. బోధన్ కు చెందిన 19 ఏళ్ల యువతిని బెదిరించిన ఇద్దరు యువకులు గత ఐదు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. యువతి గర్భం దాల్చడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం కూలి పనులు చేసే యువతి తల్లిదండ్రులు రోజూ పనులకు వెళ్లేవారు. దీంతో యువతి ఇంట్లో ఒంటరిగా ఉండేది.

ఇది గమనించిన యువతి ఇంటి సమీపంలోనే నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), స్నేహితుడు రవి (22)తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఐదు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా తాజాగా, ఆమె గర్భం దాల్చింది. దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related posts

దొరల గడీల్లో బందీ అయిన జర్నలిజాన్ని బతికిద్దాం!

Satyam NEWS

కొల్లాపూర్ నియోజక వర్గంలో గంజాయి మొక్కలు స్వాధీనం

Satyam NEWS

బీజేపీ కార్పొరేట‌ర్‌కు కేంద్ర స‌హాయ ‌మంత్రి శుభాకాంక్ష‌లు

Sub Editor

Leave a Comment