31.2 C
Hyderabad
February 14, 2025 20: 06 PM
Slider నిజామాబాద్

మరో క్రైమ్:బోధన్ పట్టణంలో యువతిపై అత్యాచారం

rape again

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో దారుణం జరిగింది. బోధన్ కు చెందిన 19 ఏళ్ల యువతిని బెదిరించిన ఇద్దరు యువకులు గత ఐదు నెలలుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. యువతి గర్భం దాల్చడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం కూలి పనులు చేసే యువతి తల్లిదండ్రులు రోజూ పనులకు వెళ్లేవారు. దీంతో యువతి ఇంట్లో ఒంటరిగా ఉండేది.

ఇది గమనించిన యువతి ఇంటి సమీపంలోనే నివసించే ఆమె పెదనాన్న కుమారుడు నవీన్ (25), స్నేహితుడు రవి (22)తో కలిసి ఆమె ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఐదు నెలలుగా ఈ దారుణం జరుగుతుండగా తాజాగా, ఆమె గర్భం దాల్చింది. దీంతో నివ్వెరపోయిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Related posts

అగ్లీ ఫెలో: ఆరు నెలలుగా కూతురిపై అత్యాచారం

Satyam NEWS

13 నుండి కాకినాడలో కంచి కామకోటి పీఠాధిపతి చాతుర్మాస్యదీక్ష

Satyam NEWS

ఆ వైసీపీ నేతకి బీజేపీ నో ఎంట్రీ .. తిరిగి జగన్‌ గూటికి…?

Satyam NEWS

Leave a Comment