42.2 C
Hyderabad
May 3, 2024 15: 21 PM
Slider తూర్పుగోదావరి

మరో దళితుడి కథ: వైసీపీ నేత దాష్టీకాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం

#Dalit Sucide

నేను ఏ పాపం చేశానని ఇంతిలా వేధిస్తున్నారు అంటూ అతను వాపోయాడు. ఎంతో బాధపడుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ… పురుగుల మందు తాగాడు….

తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం…..రాయవరం మండలం నదురుబాధ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు కథ ఇది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆరోపిస్తూ…అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు పని చేస్తున్నాడు. దళితుడననే చిన్న చూపుతో నన్ను వేదిస్తున్నారా అంటూ వాపోయాడు….

వీడియో కొనసాగుతుండగానే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు….దీంతో స్థానికులు అతనిని హుటాహుటిన రామచంద్రపురం ఆసుపత్రికి తరలించారు..

ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు….. ముత్యాలరావు కు భార్య అనంతలక్ష్మి, అజయ్ (10) , ప్రణతి (9) వున్నారు… (వీడియో చూడండి)

Related posts

ముస్లింల సమస్య తీర్చని హోమ్ మంత్రిని అడ్డుకుంటాం

Satyam NEWS

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి

Sub Editor

వి.ఆర్.ఎ ల న్యాయమైన పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

Leave a Comment