నేను ఏ పాపం చేశానని ఇంతిలా వేధిస్తున్నారు అంటూ అతను వాపోయాడు. ఎంతో బాధపడుతూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ… పురుగుల మందు తాగాడు….
తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం…..రాయవరం మండలం నదురుబాధ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు కథ ఇది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు వేధింపులు తట్టుకోలేకపోతున్నట్లు ఆరోపిస్తూ…అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ విత్తనాల ముత్యాలరావు పని చేస్తున్నాడు. దళితుడననే చిన్న చూపుతో నన్ను వేదిస్తున్నారా అంటూ వాపోయాడు….
వీడియో కొనసాగుతుండగానే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు….దీంతో స్థానికులు అతనిని హుటాహుటిన రామచంద్రపురం ఆసుపత్రికి తరలించారు..
ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు….. ముత్యాలరావు కు భార్య అనంతలక్ష్మి, అజయ్ (10) , ప్రణతి (9) వున్నారు… (వీడియో చూడండి)