ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రి కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది.
కరోనా అనుమానంతో ఆయన టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇక ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా కరోనా బారిన పడ్డారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.