38.2 C
Hyderabad
April 29, 2024 14: 32 PM
Slider నిజామాబాద్

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో మూడో ఎమ్మెల్యేకు కరోనా

#Beegala Ganesh Guptha

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. తాజాగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు రోజులుగా కరోనా లక్షణాలు ఉండటంతో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పరీక్షలు చేయించుకున్నారు. నేడు పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆయన హైదరాబాద్ వెళ్లిపోయారు.

ఇప్పటికే కరోనా పాజిటీవ్ వచ్చిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో గణేష్ గుప్త కలిసినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆయనకు కూడా పాజిటీవ్ వచ్చింది. ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనాకు గురి కావడంతో నిజామాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఎమ్మెల్యేల ద్వారా ఎంత మందికి కరోనా సోకి ఉంటుందోనని జిల్లా వాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భయపడుతున్నారు.

Related posts

శంషాబాద్‌లో మరో యువతిపై అత్యాచారం హత్య

Satyam NEWS

హిందువులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు

Satyam NEWS

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment