ఏపీ రాష్ట్ర పోలీశాఖ బాస్…డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు.. డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి విజయనగరం వచ్చారు. ఇటీవలే పీఎం మోడీ విశాఖ పర్యటన సందర్భంగా వచ్చిన డీజీపీ… ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 13 న సమీక్ష జరిగిన అనంతరం 14వ తేదీన విజయనగరం జిల్లా పోలీసు శాఖలో సీఐ ర్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ… జిల్లా లో నేరాలు తగ్గుముఖం పట్టాయని…అందుతున్న నివేదికల ద్వారా అర్ధంమైందన్నారు.ముఖ్యంగా మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టాయని…అందుకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతోందన్నారు.అలాగే 498 కేసులు కూడా తగ్గాయని…త్వరలో రిక్రూట్ మెంట్ జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.