38.2 C
Hyderabad
April 29, 2024 22: 07 PM
Slider ప్రత్యేకం

గంజాయి పంటపై ఏపి పోలీసుల ఉక్కుపాదం

#cannabis crop

గంజాయి నిర్మూలనే లక్ష్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో పోలీస్ శాఖ తీసుకున్న చర్యలతో సత్పలితాలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ కు ఇస్తున్న సహకారం, పోలీస్ సిబ్బంది పనితీరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి నిరంతర పర్యవేక్షణతో పోలీసులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతంలోని కోన్ని మండలాలు, తూర్పు గోదావరి జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి సాగు, రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి విడతలో ప్రత్యేక కార్యక్రమాన్ని 30.10.2021న ప్రారంభించింది.

ఈ ఆపరేషన్ కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంతంలోని 7500 ఎకరాల్లో గంజాయి సాగు పంటను ధ్వంసం చేయడం జరిగింది. 2022లో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు చేపట్టిన అనేక కార్యక్రమాల ద్వారా గంజాయి సాగుకు అత్యంత అనువైన జి.మాడుగుల, జి.కె.వీధి, చింతపల్లి, పెద్దబయలు, ముచంగ్గిపుట్ట, దంబ్రిగుడ, పాడేరు మండలాలలో గంజాయి సాగుని గణనీయంగా నిర్మూలించడంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ సఫలీకృతమైంది.

పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు

ఈ సంవత్సరం చేపట్టిన మొదటి, రెండో విడత ప్రత్యేక కార్యక్రమలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు గంజాయి సాగు, రవాణా పట్ల జరిగే నష్టాన్ని వివరిస్తూ వారిలో అవగాహన కల్పించడంతో పాటు గంజాయి సాగు మరియు రవాణా కు పాల్పడుతున్న వారిపైన కేసులు నమోదు చేయడం, పాత నేరస్తులను గుర్తించి వారిపైన PD ACT ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా గంజాయేతర పంటలకు విత్తనాలను రైతులకు ఉచితంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది. అల్లం, పసుపు లాంటి పంటలను వేసుకునేందుకు అవకాశం కల్పించారు.

గంజాయి సాగును గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

నవంబర్-2022 మొదటి విడత 480 ఎకరాలు, డిసెంబర్-2022 రెండో విడతలో 120 ఎకరాలలో గంజాయి సాగుచేస్తున్నట్లు స్థానికంగా అందుబాటులో ఉన్న సమాచారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంజాయి సాగు చేస్తున్న ఆయ ప్రాంతలను ఉపగ్రహ చాయా చిత్రాలు ద్వారా గుర్తించి వాటిని నిర్మూలించేందుకు స్థానిక పోలీసులతోపాటు అదనంగా గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, ఎస్‌ఐ‌బి సిబ్బందితో నవంబర్, డిసెంబర్ లో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలలో ఐదు రోజుల పాటు అక్కడే క్యాంప్ ను ఏర్పాటు చేసుకొని మొత్తం 600 ఎకరాల్లోని గంజాయి సాగును నిర్మూలించడం జరిగింది.

నిరంతర తనిఖీలు

ఏజెన్సీలోని ప్రాంతాల నుండి గంజాయి రవాణా ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం వాహనాల తనిఖీలు, ఏజెన్సీలోకి వచ్చే కొత్త వ్యక్తుల కదలికలపైన నిఘా కొనసాగించడం ద్వారా స్వాధీనం చేసుకున్న గంజాయి ఒరిస్సా లోని మల్కాంగిరి జిల్లా నుండి రవాణా అవుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. దీనిని పూర్తిస్థాయిలో అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒరిస్సా రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాము దీని ద్వారా గంజాయి రవాణా ను పూర్తి స్థాయిలో నియంత్రించడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖలు అధికారుల సంపూర్ణ సహకారం తో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలుగా సిల్వర్ ట్రీ, పెప్పర్, కాఫి, పసుపు, మామిడి, కొబ్బరి మొక్కలు, జీడి మామిడి, రాగి, రాజ్మ, కంది పంట, అల్లం, వరిపంట, రబ్బర్ మొక్కలు, నిమ్మ, జాఫ్రా, పత్తి, నువ్వులు, పచ్చిమిర్చి,రాగులు, పల్లి, కూరగాయల విత్తనాలను అందిస్తూంది. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ వివిధ కేసుల్లో మొత్తం 2,45,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. దీంట్లో 70% ఒరిస్సా నుండి వస్తున్నట్లు తేలింది.

23-12-2022 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, ఏలూరు,గుంటూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని దహనం చేసేందుకు ప్రణాళిక వివరాలు:

(23-12-2022) ఏలూరు రేంజ్ పరిధిలోని తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పచ్చిమ గోదావరి, క్రిష్ణ జిల్లాలో 465 కేసులలో స్వాధీనం చేసుకున్న 64,832. కిలోల గంజాయిని కాల్చివేయడం జరిగింది.

(24-12-2022) విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం,అల్లూరి సీతారామరాజు, పార్వతిపురం మన్యం,అనకాపల్లి జిల్లాలలో స్వాధీనం చేసుకున్న 1,80,000 కిలోలకు పైగా గంజాయిని అనకాపల్లి జిల్లా, కోడూరు గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతంలో కాల్చివేయడం జరుగుతుంది.

(24-12-2022) గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో స్వాధీనం చేసుకున్న 10,000 కిలోలకు పైగా గంజాయి ని కాల్చివేయడం జరుగుతుంది.

25-12-2022 విశాఖపట్నం సిటి, విజయవాడ సిటి లో 25000 కిలోల గంజాయిని కాల్చివేయడం జరుగుతుంది.
(26-12-2022) కర్నూలు, అనంతపురం రేంజ్ పరిధిలో 16000 కిలోల గంజాయిని కాల్చివేయడం జరుగుతుంది.

గంజాయి రవాణా కట్టడికి కార్యాచరణ ప్రణాళిక-2023

గంజాయి సాగు,రవాణా, నియంత్రణ, లభ్యతపై విధానపరమైన కార్యక్రమాలుతో పాటు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు సరఫరా చేస్తున్న నెట్ వర్క్ పైన ప్రత్యేక దృష్టి సారిస్తాము.

గంజాయి పైన చైతన్యం కోసం హోర్డింగ్ లపైన అన్ని కాలేజీలు స్కూల్స్ వద్ద SEB టోల్ ఫ్రీ నెంబర్లతో ప్రచారం ఇవ్వడం జరుగుతుంది.

Related posts

వైఎస్సార్‌కు సీఎం జగన్‌ నివాళి

Satyam NEWS

ముంపు బాధితుల కోసం కోటి ఇచ్చిన బండి

Bhavani

సెకండ్ వేవ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలంటున్న జిల్లా క‌లెక్ట‌ర్

Satyam NEWS

Leave a Comment