ఏపిలో కరోనా భయం రాజకీయ నాయకులను వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి క్యాంపు కార్యాలయాలు మూసివేయాలని స్పీకర్, ఓ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయాలు నేటి నుంచి మూసివేశారు. గురువారం నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు ఎవరూ రావద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.