ద్వారకా క్రైమ్ సీఐ గా చీపురుపల్లి శ్రీనివాసరావు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో న్యూ పోర్ట్ ఎస్సై గా అనంతరం ,సీఐ గా సిఐడిలోను,రెండో పట్టణ శాంతి భద్రతల విభాగం , విజయనగరం జిల్లా సిసిఎస్ విభాగంలో సాలూరు టౌన్ సీఐ పని చేసారు అనంతరం ద్వారకా క్రైమ్ సిఐ గా బాధ్యతలు చేపట్టారు. గతం లో విశాఖలోని టూ టౌన్ శాంతి భద్రతల విభాగంలో డెల్టా ఒన్ ట్రాఫిక్ సీఐ గాను విధులు నిర్వహించి అనేక కీలకమైన కేసులను ఛేదించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.
ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సహకారం తో దొంగతనాల్ని అరికట్టడానికి కృషి చేస్తానని అన్నారు. నేరాల నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ దక్షిణ భారత విభాగం కోఆర్డినేటర్, సీనియర్ జర్నలిస్ట్ ఎం వి ఎస్ జి తిలక్ సీఐ శ్రీనివాసరావు ను కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో అంకిత భావం, నిబద్ధతతో అనేక కీలకమైన కేసులను ఛేదించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారని కొనియాడారు.