తెలుగు నాటక రంగ ప్రభాకరుడు ప్రముఖ న్యాయవాది,రచయిత,బళ్లారి రాఘవ జయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ లోని అలంకార్ కాన్ఫరెన్స్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన శ్రీ విష్ణు సేవ పరిషత్ శ్రీ కౌసల్య ఆర్ట్ థియేటర్ వారి పంచమ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ గుంటి పిచ్చయ్య నటించిన భీమసేనుడు ఏకపాత్రాభినయం పలువురుని అలరించి ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా విశ్వజనని ఫౌండేషన్ ఫౌండర్ బ్రహ్మానందం,ఫిలాన్ట్రోఫీక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాజా,పుడమి సాహిత్య సంస్థ అధ్యక్షుడు బాల్రెడ్డి భీమ పాత్రధారి గుంటి పిచ్చయ్య కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.నాటక ప్రేక్షకులు అభినందించారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్