తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజక వర్గ హెచ్ ఎం టి వి రిపోర్టర్ పి నాగేంద్ర కు ఏలూరు జిల్లా దెందులూరు, ఏలూరు నియోజక వర్గాల ఏ పి డబ్యు జె ఎఫ్ ప్రతినిధులు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. నాగేంద్ర కు ప్రభుత్వం న్యాయం చేయాలని, నాగేంద్ర ఆత్మ హత్య చేసుకునే ప్రయత్నం వరకు మానసిక వత్తిడికి గురిచేసిన గోపాలపురం నియోజకవర్గ కేంద్రం లో 5గురుగా చెప్పబడుతున్న ప్రముఖ్ ఛానల్ రిపోర్టర్ లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని దెందులూరు, ఏలూరు ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ సంయుక్తంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గోపాల పురం తో పాటు రాష్ట్రం లో మరెక్కడా విలేకరులపై ఇటువంటి వేధింపులు పునరావృతం కాకుండా ఉండాలంటే గోపాలపురం లో చానల్స్ ని అడ్డుపెట్టుకుని రేషన్, పశు రవాణా, గంజాయి రవాణాకు సహకరించే మీడియా ప్రతినిధులను ఆయా ఛానల్ యాజమాన్యాలు తక్షణమే విధుల నుండి తొలగించాలని ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ దెందులూరు, ఏలూరు శాఖల అధ్యక్షులు రుషి, సూర్య సోమవారం డిమాండ్ చేశారు.
previous post