కడపలో కరోనాతో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ మృతి చెందాడు. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరప్రసాద్ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.
కరోనా తో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ మృతి చెందడంతో పోలీస్ శాఖ లో కలకలం రేగింది. కాగా జిల్లా పోలీసు కార్యాలయంలో వరప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ జిల్లా ఎస్పీ అన్బు రాజన్, ఇతర అధికారులు నివాళులు అర్పించారు.