రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30వ తేదీన ఆయన పర్యటనకు రానున్నారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ తలసిల రఘురాం, పల్నాడుజిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.