స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే స్వాతంత్ర్య వేడుకలకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్నారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు జరుగుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో కూడిన శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. డయాస్, జెండా ఏర్పాట్లను సిద్దం చేయాలని అన్నారు. సౌండ్ సిస్టం, పొడియం, ఇన్విటేషన్, స్పీచ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, డెకరేషన్ కు సంబంధించి, మెడికల్, తదితర శాఖల వారిగా అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల జారికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
పోలీస్ శాఖ తరపున బందోబస్త్ ఏర్పాటు చేయాలని అన్నారు. వేడుకల సందర్బంగా ఆహ్వాన పత్రికలు అందజేయాలని, ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రజలకు సీటింగ్ అరెంజ్ మెంట్లు చేయాలని, ప్రజలకు, విద్యార్థిని ,విద్యార్థులకు త్రాగు నీరు ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు, సిబ్బంది అంతా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.