తెలంగాణ తెలుగుదేశం పార్టీ రోజు రోజుకూ బలోపేతం అవుతున్నది. తాజాగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అట్లూరి సుబ్బారావును నియమించారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన అట్లూరి సుబ్బారావు నియామకంతో ఆ పార్టీ బలోపేతం అయింది.
ఈ రోజు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు అట్లూరి సుబ్బారావుని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు సోమవారం సుబ్బారావు కాసాని జ్ఞానేశ్వర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు.