ఏటీఎంలో డబ్బులు ఉంచేందుకు సిబ్బంది వెళ్లగా క్యాష్ వ్యాన్ నుంచి చోరీ చేశారు కొందరు. గుంటూరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన ఉన్న ATM లో నగదు నిల్వ చేసేందుకు క్యాష్ వ్యాన్ వచ్చింది. సిబ్బంది ఏటీఎం సెంటర్ లోకి వెళ్లడం చూసిన కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
మొత్తం 36 లక్షల రూపాయలు వ్యాన్ నుంచి చోరీ చేశారు. వెంటనే జిల్లా ఎస్ పి ఆదేశాను సారం నల్లపాడు పోలీసులు విచారణ చేపట్టారు. వాన్ లో ఉన్న నలుగురికి సంబంధించిన వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు ప్రాధమిక దర్యాప్తులో ఒక నిర్ణయానికి వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.