జనవరి 10న జరిగే కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం అందింది. అరణ్య భవన్ లో ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రిని ఆహ్వానించిన వారిలో ఆయల ఈవో బాలాజీ, ఏఈవో గంగ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మల్లికార్జున్, స్థానాచార్యులు మల్లయ్య తదితరులున్నారు.
previous post