28.7 C
Hyderabad
April 27, 2024 06: 40 AM
Slider చిత్తూరు

కూల్‌డ్రింక్‌‎లో మత్తు మందు కలిపి అత్యాచారం

#rape

నమ్మించి… మత్తు మందిచ్చి.. ఓ యువతి (19)పై ఇద్దరు బిడ్డల తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

అలిపిరి సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన ప్రకారం.. ఓ యువతి తండ్రి ఏడేళ్ల కిందట ప్రమాదంలో మృతిచెందాడు.

తల్లి అనారోగ్యంతో రెండేళ్లక్రితం చనిపోయింది. దీంతో కుటుంబ స్నేహితుడు, మంగళం బీటీఆర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఆమె జీవనం సాగిస్తోంది.

అదే ప్రాంతానికి చెందిన నాగేంద్రబాబు తనపై అత్యాచారానికి పాల్పడ్డట్టు ఆ యువతి అలిపిరి పోలీసులకు శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేసింది.

28వ తేదీ తనకు మాయమాటలుచెప్పి శ్రీనివాసం సమీపంలోని ఓ లాడ్జికి నాగేంద్రబాబు తీసుకెళ్లాడని, మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేరకు సీఐ దేవేంద్రకుమార్‌ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగేంద్రబాబుకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.

Related posts

సంక్షోభంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ

Murali Krishna

అర్హులందరికీ నవరత్నాలు అందించేందుకు ‘వైఎస్సార్ నవశకం’

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణ భావితరాలకు కానుక

Satyam NEWS

Leave a Comment