హైదరాబాద్ లో మరో దారుణం.. ముగ్గురు యువకులు తమ స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని పుట్టినరోజు వేడుక ల కని లాడ్జికి తీసుకెళ్లి కేకులో మత్తుమందు కలిపి సామూహికంగా అత్యాచారం చేశారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
జూబ్లీహిల్స్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ యువతి(19) సికింద్రాబాద్లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. తమ ఇంటి పరిసరాల్లో ఉండే జోసెఫ్, నవీన్రెడ్డి, రాములు ఆమెకు స్నేహితులయ్యారు. ఈనెల 5న ఆమె ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లింది.
ఆ సమయంలో జోసెఫ్ ఫోన్ చేసి ఆ రోజు తన పుట్టినరోజని, నవీన్, రాములుతో కలిసి వేడుక చేసుకుందామని ప్రతిపాదించాడు. స్నేహితులన్న నమ్మకంతో ఆమె సరేనంది. కళాశాల నుంచే నలుగురూ ఓ హోటల్కు వెళ్లారు. బిర్యాని పార్శిల్ తీసుకొని ట్యాంక్బండ్ బుద్ధ విగ్రహం వద్ద కొద్దిసేపు మాట్లాడుకొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు కేపీహెచ్బీలోని ఓ లాడ్జికి వెళ్లారు. నవీన్ బయటకు వెళ్లి కేక్ తెచ్చాడు. పథకం ప్రకారం ముందుగా కేక్పై మత్తుమందు చల్లారు. అందరం కలిసి తిందామని యువతి అనగా.. ముందు నువ్వే తినాలంటూ జోసెఫ్ ఆమెకు తినిపించాడు. కొద్దిసేపటికే ఆమె మత్తులోకి వెళ్లింది.
ముగ్గురూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించిన నిందితులు ఆమెను ఆటోలో ఇంటికి పంపించేశారు. ఆరోజు నుంచి బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈనెల 11న అపస్మారకస్థితికి వెళ్లగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడ ఆమె జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి సైబరాబాద్కు బదిలీ చేశారు.