రెండు నెలలకు పైగా మండలం-మకరవిలక్కు తీర్థయాత్రల తరువాత శబరిమల లోని అయ్యప్ప ఆలయాన్ని మూసి వేశారు. ఈ నెల 15 వ తేదీన మకరవిళక్కు కార్యక్రమం ముగిసింది. అయినప్పటికీ భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో సోమవారం వరకూ ఆలయాన్ని తెరిచి ఉంచారు. నేడు ఆలయాన్ని మూసి వేశారు. ఈ చివరి రోజు కూడా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో శబరిమల కిటకిటలాడింది. సాంప్రదాయం ప్రకారం, పందలం ప్యాలెస్ రాజు గర్భగుడి ముందు ప్రార్థనలు చేశారు. తరువాత పవిత్ర ఆభరణాలను వెనక్కు తీసుకు వెళ్ళారు. మళ్ళీ ఆలయం ఫిబ్రవరి 13న నెలవారీ పూజల కోసం తెరుస్తారు.
previous post