36.2 C
Hyderabad
April 27, 2024 22: 02 PM
Slider ఆధ్యాత్మికం

హనుమంత వాహనంపై కోదండ‌రాముని అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

#tirumala

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన బుధ‌వారం ఉదయం హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముని అలంకారంలో స్వామివారు ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడిగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధిచెందాడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయులు కనుక వీరిని ద‌ర్శించిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది. మ‌ధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు పుణ్యాహవచనం, వసంతోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Related posts

ఆర్సీఎం పాఠశాల లో 30 శాఖల ఏర్పాటు..కొత్త జిల్లాకు ముమ్మర ఏర్పాట్లు

Satyam NEWS

ఈ నరరూప రాక్షసులకు హ్యూమన్ రైట్స్ ఎందుకు?

Satyam NEWS

కరెంట్ చార్జీలు పెరగట్లే

Murali Krishna

Leave a Comment